Facebook Crime In Hyderabad: ఫేస్బుక్లో ఘరానా దొంగలు.. భార్యభర్తలు కలిసి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని..

X
Facebook Crime In Hyderabad: హైదరాబాద్లో ఓ ఘరానా దంపతుల మోసం వెలుగుచూసింది. నకిలీ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా 85 లక్షల మోసానికి పాల్పడ్డారు ఎర్రగుడ్ల దాసు, జ్యోతి. ఫేస్బుక్ అకౌంట్ నుంచి సికింద్రాబాద్కి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్కు యువతి పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు. కొన్ని రోజుల తర్వాత ప్రేమ.. పెళ్లి చేసుకుందామని నమ్మించారు. డబ్బులు కావాలంటూ విడతల వారిగా 85 లక్షల కాజేశారు. మోసపోయానని తెలుసుకున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
