Crime News: ఇద్దరమ్మాయిల ప్రేమ.. మధ్యలో మరొకరు ఎంట్రీ ఇవ్వడంతో..

Crime News: ఇద్దరమ్మాయిల ప్రేమ.. మధ్యలో మరొకరు ఎంట్రీ ఇవ్వడంతో..
Crime News: వాళ్లిద్దరూ స్నేహితులు.. వారి స్నేహం ప్రేమగా మారింది.. కలిసి సహజీవనం చేస్తున్నారు..

Crime News: వాళ్లిద్దరూ స్నేహితులు.. వారి స్నేహం ప్రేమగా మారింది.. కలిసి సహజీవనం చేస్తున్నారు.. ఇంతలో ఇద్దరిలో ఒకరికి ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. దానితో ఆమెను ప్రేమించిన అమ్మాయికి చిర్రెత్తుకొచ్చింది. మరో ఆలోచన లేకుండా చంపేసింది. మంచిర్యాల జిల్లా మామిడిగట్టుకు చెందిన నల్లూరి అంజలి (21)కి అమ్మమ్మ ఊరిలో ఉన్న మహేశ్వరితో పరిచయం ఏర్పడింది. అంజలి కళ్లద్దాల దుకాణంలో పని చేసేది.. మహేశ్వరి బట్టల షాపులో పని చేస్తుండేది. అయితే మహేశ్వరి వస్త్రధారణ చిన్నప్పటి నుంచి అబ్బాయి మాదిరిగా ఉండేది. ప్రవర్తన కూడా అలాగే ఉండడంతో అంజలి.. మహేశ్వరి ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి రూము తీసుకుని ఉంటున్నారు. రెండేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు.

ఈ క్రమంలో అంజలికి మంచిర్యాలలో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ పరిచయమయ్యాడు. అతడితో కలిసి తిరగడం మొదలు పెట్టి, మహేశ్వరిని దూరం పెట్టింది అంజలి. బుధవారం రాత్రి డ్యూటీ ముంగించుకుని రాత్రి 8.15 గంటలకు గదికి వెళ్లింది. 10గంటలప్పుడు అంజలి దగ్గరకు మహేశ్వరి వచ్చి బయటకు వెళదామంది.. ఇద్దరూ కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లారు. రాత్రి 11.30 గంటలకు మహేశ్వరి.. శ్రీనివాస్‌కు ఫోన్ చేసి అంజలి ఆత్మహత్య చేసుకుందని చెప్పింది. దీంతో అతడు వెంటనే కారు తీసుకుని సంఘటనా స్థలానికి వెళ్లాడు.. మెడపై కత్తిపోటు గాయాలకు గురైన అంజలి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. శ్రీనివాస్ హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించాడు. కానీ అప్పటికే అంజలి మృతి చెందింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు మహేశ్వరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story