Cyber Criminals : రైతుల సొమ్ముపై సైబర్ నేరగాళ్ల కన్ను.. సర్కార్ అలర్ట్

రాష్ట్రంలో రుణమాఫీ సొమ్ము జమ కావడంతో తెలంగాణ రైతుల్ని రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అప్రమత్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ జరుగుతున్న వేళ సైబర్ నేరగాళ్లు రెచ్చి పోయే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ పోలీసులు ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు.
ఈ మేరకు తాజాగా సైబర్ సెక్యూరిటీ అధికారులు ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఫోన్లలో అనవసరమైన లింకులపై క్లిక్ చేయొద్దని రైతుల్ని హెచ్చరిస్తోంది. రైతులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు దాడులకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ కీలక సూచన చేసింది. గత కొంతకాలంగా వాట్సాప్ లో ఏపీకే లింకులు పంపిస్తున్న సైబర్ నేరగాళ్లు ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు.
ఇటీవల కాలంలో ఆర్టీవో అధికారులు, బ్యాంకుల పేరిట ఆ లింకులు వస్తున్నాయని, వాటిని క్లిక్ చేసి చాలామంది మోసపోతున్నారని సైబర్ సెక్యూరిటీ అధికారులు వివరిస్తున్నారు. ఈ క్రమంలో అలాంటి లింకులు వస్తే క్లిక్ చేయొద్దని సైబర్ సెక్యూరిటీ పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com