Cyber Fraud : ట్రంప్ పేరు చెప్పి 150 మందికి కుచ్చుటోపి

Cyber Fraud : ట్రంప్ పేరు చెప్పి 150 మందికి కుచ్చుటోపి
X

రోజుకోతరహా మోసంతో అమాయక ప్రజలకు కుచ్చుటోపి పెడుతున్న సైబర్ నేరగాళ్లు తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు చెప్పి పెద్ద స్కామ్కు తెరలేపారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు సుమారు 150 మందిని నమ్మించి వారి నుంచి కోటి రూపాయలకు పైగా దోచుకున్నారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఈ మోసం చోటు చేసుకుంది. కేటుగాళ్లు కృత్రిక మేథస్సు (ఏఐ)ని ఉపయో గించి యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నట్లు వీడియోలు సృష్టించారు. పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని ఆయన సూచిస్తున్నట్లు ఉన్న పలు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. బెంగళూరు, హవేరీ, తుమకూరు ప్రాంతాల్లోని సుమారు 150 మంది వాటిని నమ్మి యాప్లో పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి పెట్టిన వారిని నమ్మించేందుకు సైబర్ నేరగాళ్లు కొంత కాలం పాటు వారికి లాభాలు వస్తున్నట్లు యాప్లో చూపిస్తూ డబ్బు,ౌ బహుమతులు ఇస్తూ వచ్చారు. కొద్ది రోజులుగా ఎవరికీ ఫోన్ లో అందుబాటులోకి రాకపోవడంతో మోస పోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story