Wanaparthy: కోడలిపై కన్నేసిన మామ.. కర్రతో కొట్టి చంపిన కోడలు..

Wanaparthy: వనపర్తి జిల్లా గోపాల్పేట మంలం చెన్నూరు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. తనను లైంగికంగా వేధిస్తున్నాడన్న కోపంతో ఓ మహిళ మామను చితకబాదింది. దీంతో అతను ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది. 58 ఏళ్ల రాములు అనే అతని కొడుకు అదేగ్రామానికిచెందిన చంద్రకళను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కుమారుడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో రాములు కోడలు మీద కన్నేశాడు.
దీంతో మామ లైంగిక వేధింపులు భరించలేక చంద్రకళ తన తమ్ముడి సహాయంతో మామపై దాడికి పాల్పడింది. అతని పరిస్థితి విషమంగా మారడంతో పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు. మృతుడి బంధువులు మాత్రం ఆస్తికోసమే కోడలు మామను హత్యచేసిందని ఆరోపిస్తున్నారు. పోలీసులు చంద్రకళ,ఆమె తమ్ముడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com