TG : హైదరాబాదులో రూ. 7 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత నలుగురి అరెస్ట్

X
By - Manikanta |20 July 2024 6:48 PM IST
హైదరాబాద్: రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని రాజస్థాన్ కు చెందిన వ్యక్తులు, వ్యాపారవేత్తలే లక్ష్యంగా విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఓటీ శంషాబాద్, మాదాపూర్ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి.. వారి నుంచి 1,250 గ్రాముల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.7 కోట్లు ఉంటుందని తెలిపారు. నిందితులు నలుగురూ రాజస్థాన్ కు చెందిన వారేనని సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మహంతి మీడియాకు వెల్లడించారు. హెరాయిన్ను చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి.. బస్సుల్లో తీసుకొస్తున్నట్లు చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com