Hyderabad : నకిలీ కోర్టు.. ఫేక్ జడ్జి.. కోటిన్నరకు టోకరా

Hyderabad : నకిలీ కోర్టు.. ఫేక్ జడ్జి.. కోటిన్నరకు టోకరా
X

నకిలీ కోర్టును సృష్టించి.. ఫేక్ జడ్జిని పెట్టి ఏకంగా కోటిన్నరకు టోకరా వేసిన ఘటన హైదరాబాద్ లోని వనస్థలిపురంలో చోటు చేసుకుంది. వనస్థలిపురం ప్రాంతానికి చెందిన ఓ మాజీ చీఫ్ ఇంజనీర్కు ఓ వీడియో కాల్ వచ్చింది. ఆ కాల్లో 'మీ పేరు ఓ కేసులో ఉంది, విచారణ సుప్రీం కోర్టులో జరుగుతోం ది, జస్టిస్ స్వయంగా దీనిని పర్యవేక్షిస్తున్నారు అని తెలిపారు. కోర్టు స్టాఫ్ నటిస్తూమాట్లాడటం,భయపెట్టడం మొదలుపెట్టారు. అంతలో “జస్టిస్ కేసు తీవ్రంగా ఉందని, వెంటనే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని” చెబుతూ ఒక నకిలీ జడ్జి వీడియో కాల్లోకి వచ్చాడు. అతని హావభావాలు, వేషధారణ, మాటతీరు నిజమైన న్యాయమూర్తిలా ఉండటంతో బాధితుడు పూర్తిగా నమ్మాడు. 'ఈ కేసుకు సంబంధించి మీరు కొంత మొత్తంలో డబ్బులు ముందుగా సుప్రీం కోర్టు అకౌంట్లో జమ చేయాలి. కేసు ముగిసిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి ఇస్తాం' అని నకిలీ జడ్జి చెప్పాడు. నమ్మిన బాధితుడు తన ఖాతాలోని రూ. కోటిన్నరను సూచించిన ఖాతాకు బదిలీ చేశాడు. అనంతరం ఎటువంటి సమాచారం రాకపోవడంతో, డబ్బులు తిరిగి రాకపోవడంతో అసలు విషయం తెలుసుకున్న బాధితుడు రాచకొండ పోలీసులను ఆశ్రయించాడు.

Tags

Next Story