Fraud : పెట్టుబడుల పేరుతో రూ.24 కోట్లకు టోకరా

Fraud : పెట్టుబడుల పేరుతో రూ.24 కోట్లకు టోకరా
X

పెట్టుబడి పేరుతో బాధితుల నుంచి రూ.24 కోట్లు కాజేసిన నలుగురు నిందితులను హైదరాబాద్‌ ఆర్థిక నేరవిభాగం పోలీసులు అరెస్టు చేశారు. బైబ్యాక్‌ పేరుతో రూ. 17 లక్షలు పెట్టుబడి పెడితే.. 100 నెలల పాటు ప్రతి నెలా రూ.30వేలు ఇస్తామని ఆకర్షించారు. దీనికి అదనంగా పలు ప్రాంతాల్లో స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేస్తామని చెప్పారు. ఆ భూమిలో గంధపు చెట్లు నాటి 13-15 ఏళ్లకు 50శాతం వాటా ఇస్తామని నమ్మబలికారు. పెట్టుబడి పెట్టిన మొదటి రెండు నెలలు చెప్పిన విధంగా రూ.30 వేలు చొప్పున ఇచ్చారు. ఆ తర్వాత డబ్బులు చెల్లించడం ఆపేశారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. మొత్తంగా 120 మంది బాధితుల నుంచి రూ. 24 కోట్లు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags

Next Story