Fraud : డబుల్ ప్రాఫిట్ పేరుతో రూ.4.50 కోట్లు టోకరా

Fraud : డబుల్ ప్రాఫిట్ పేరుతో రూ.4.50 కోట్లు టోకరా
X

పెట్టుబడులు పెడితే... అనతి కాలంలో రెట్టింపు చేస్తామని రూ.4.50 కోట్లు వసూలు చేసి మోసం చేసిన కేసులో నిందితుడిని సైబరాబాద్ ఎకానామిక్ అఫెన్సెస్ వింగ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ డీసీపీ ప్రసాద్ తెలిపిన ప్రకారం బోరబండ రాణా ప్రతాప్ నగర్ కు చెందిన రెండ్ల అజయ్ కుమార్ మెడికల్ డిస్ట్రిబ్యూటర్. 2020 మే నెలలో ఏఐమైటీ ఫార్మా పేరుతో కంపెనీ స్టార్ట్ చేశాడు.

కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే 10 శాతం ప్రాఫిట్ ఇస్తానని అల్లాపూర్ కు చెందిన కావలి శ్రీనివాస్ తో పాటు మరో 35 మంది నుంచి రూ.4.50 కోట్లు వసూలు చేసి వారికి బాండ్ పేపర్ రాసిచ్చాడు. కాలక్రమంలో వారి పెట్టుబడులకు సంబంధించి ఎలాంటి మొత్తాలు రాకపోవడంతో కావలి శ్రీనివాస్ సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు అజయ్ సమారు అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.

Tags

Next Story