Hanumakonda : ఆస్తి కోసం సవతి తల్లిని సంపిండు

భూమి, ఆస్తి తగాదాల కారణంతో సవితి తల్లిని కొడుకు అతి దారుణంగా గొడ్డలితో కొట్టి చంపిన ఘటన.. హనుమకొండ జిల్లాలో కలకలం రేపింది... పెగడపల్లి గ్రామానికి చెందిన చల్ల శ్రీనివాస్ రెడ్డి మొదటి భార్యకు చల్ల భూపాల్ రెడ్డి మరో ఇద్దరు సంతానం ఉన్నారు. గత కొన్ని ఏండ్ల క్రితం చల్ల శ్రీనివాస్ రెడ్డి మొదటి భార్య చనిపోవడంతో సరోజనను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కొంతకాలంగా సరోజన కూతుర్లకు భూపాల్ రెడ్డికి ఆస్తి భూతగాదాలు నెలకొన్నాయి. భూపాల్ రెడ్డికి ఆస్తి భూమి విషయంలో న్యాయం జరగలేదని కోపంతో ఉన్నారు. ఈక్రమంలో నిన్న అర్ధరాత్రి భూపాల్ రెడ్డికి సరోజన మధ్య గొడవ జరిగింది. మాట మాట పెరగడంతో ఆగ్రవేషానికి గురైన భూపాల్ రెడ్డి గోడ్డలితో పినతల్లి సరోజిన పై దాడి చేశాడు. సరోజన తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయింది. విషయం తెలుసుకున్న కాకతీయ యూనివర్సిటీ పోలీసులు చేరుకొని ఘటనాస్థలికి చేరుకొని డెడ్ బాడీని ఎంజీఎం మార్చరికి తరలించారు. నిందితుడు భూపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com