Suicide : భార్యపై అనుమానంతో భర్త సూసైడ్

Suicide : భార్యపై అనుమానంతో భర్త సూసైడ్
X

రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భార్యపై అనుమానం పెట్టుకున్న భర్త చనిపోవాలని నిశ్చయించుకున్నాడు. దీంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండి గౌరెల్లి గ్రామానికి చెందిన గంగనమోని నగేష్ (25)కి ఇటీవల ఒక మహిళతో వివాహం జరిగింది. అయితే కొంతకాలంగా తన భార్య మరొక వ్యక్తితో చనువుగా మాట్లాడుతోందని మనోవేదనకు గురై నగేష్ తన ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నగేష్‌ మృతితో గౌరెల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags

Next Story