Kadapa : టీడీపీ నేత హత్యకు వైసీపీ నేతల కుట్ర

X
By - Vijayanand |25 Feb 2023 3:22 PM IST
వ్యక్తిగత కక్షలు, భూతగాదల కారణంగా జనార్ధన్రెడ్డిని హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది
కడప జిల్లాలో టీడీపీ నేత హత్యకు కుట్ర చేశారు వైసీపీ నేతలు. కమలాపురం మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నేత జనార్ధన్రెడ్డిని హత్య చేసేందుకు... వైసీపీ నేత పుత్త మధుసూధన్ రెడ్డి ప్లాన్ చేశారు. ఇందుకోసం, ఓ కిరాయి ముఠాతో ఒప్పందం చేసుకున్నాడు.
జనార్ధన్రెడ్డి హత్యకు ప్లాన్ చేస్తుండగా ఇంటలిజెన్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మధుసూధన్రెడ్డితో పాటు మరికొందరిని కమలాపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. వ్యక్తిగత కక్షలు, భూతగాదల కారణంగా జనార్ధన్రెడ్డిని హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com