Chittoor: రూ. 40 కోట్లతో ఉడాయించిన చీటర్.. మహిళా భక్తులే టార్గెట్..
By - Divya Reddy |6 March 2022 3:50 PM GMT
Chittoor: గుడికివచ్చే మహిళా భక్తులనే టార్గెట్ చేసుకొని భారీ మోసానికి పాల్పడ్డాడు ఓ చీటర్.
Chittoor: గుడికివచ్చే మహిళా భక్తులనే టార్గెట్ చేసుకొని భారీ మోసానికి పాల్పడ్డాడు ఓ చీటర్. చిత్తూరుజిల్లా బంగారుపాళ్యంలో ఓంశక్తి అమ్మవారి ఆలయ నిర్మాణం పేరుతో మహిళా భక్తులతో చిటీలు వేయించాడు. దాదాపు 40 కోట్లతో ఉడాయించాడు. స్థానికంగా ఉండే ఆంజనేయులు అలియాస్ సాయినాథ్ కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను నమ్మించి చిటీలు ప్రారంబించాడు. చెల్లని చెక్కులను ఇచ్చి 40 కోట్లతో ఉడాయించాడు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితుల ఫిర్యాదుతో చిత్తూరు క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com