Hanumakonda : భీమదేవరపల్లిలో వివాహిత దారుణ హత్య

పెళ్లైన మహిళ నిన్న రాత్రి దారుణహత్యకు గురయ్యారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగపూర్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గూళ్ల రాజు తనకు సోదరి వరస అయిన కోల సుమలత(32)తో వివాహేతర సంబంధం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మహిళ కొడుకు వెంకటేష్ గతంలో తన తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న రాజును మందలించా డు. దీంతో అతడిపై 6 నెలల క్రితం గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. తాజాగా నిన్న మహిళతో మాట్లాడేందుకు నిందితుడు ఆమె ఇంటికి వచ్చాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాట పెరగడంతో సుమలతపై గొడ్డలితో దాడి చేశాడు. ఆ సమయంలో ఆమె భర్త పోచయ్య, బిడ్డ తేజస్విని ఇంటి వద్ద లేరు. ఉదయం బావి వద్దకు వెళ్లిన ఇద్దరు పనులు పూర్తి చేసుకొని సాయంత్రం ఇంటికి రాగా రక్తపుమడుగులో సుమలత విగతజీవిగా కని పించింది. దీంతో మృతురాలి భర్త పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చే రుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com