TG : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని.. కన్నబిడ్డలపై తల్లి విష ప్రయోగం

డోర్నకల్ మండలం జోగ్యతండ గ్రామంలో కన్నతల్లి రాక్షస తత్వాన్ని చాటింది. అభం శుభం తెలియని చిన్నారులకు కూల్ డ్రింక్ లో విషం కలిపి చంపాలని చూసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబం సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వాంగుడోత్ వెంకటేష్, ఉషకు 9 సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి ఒక కూమారుడు వరుణ్ తెజ్(7), ఒక పాప నిత్య శ్రీ(5) ఉన్నారు. గత మూడు నెలల క్రితం వెంకటేష్ అనారోగ్యంతో చనిపోయాడు. వెంకటేష్ చనిపోయిన దగ్గర నుండి వెంకటేష్ భార్య ఉషా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని కుమారుడు వరుణ్ తేజ్, కూతురు నిత్య శ్రీ చంపాలని ప్లాన్ వేసింది. ఈనెల 5వతేదీన ఉదయం 7గంటలకు థమ్సప్ లో గడ్డి మందు కలిపి పిల్లలకు తాపించింది. థంసప్ తాగిన వెంటనే పిల్లలు వాంతులు చేసుకుంటుంటే గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. హాస్పిటల్లో డాక్టర్లు పిల్లలను పరీక్షలు చేసిన వెంటనే పాయిజన్ తీసుకున్నట్టు నిర్ధారణ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com