Adilabad : నిర్మల్లో హత్యకు దారి తీసిన ప్రేమ వ్యవహారం

X
By - TV5 Digital Team |2 Feb 2022 11:19 AM IST
Adilabad : నిర్మల్లో ప్రేమ వ్యవహారం ఓ యువకుడి హత్యకు దారి తీసింది.
Adilabad : నిర్మల్లో ప్రేమ వ్యవహారం ఓ యువకుడి హత్యకు దారి తీసింది. లోకేశ్వరం మండలం గడ్చంద గ్రామానికి చెందిన ప్రసాద్ అనే యువకుడు స్థానిక మహాలక్ష్మీ ఆసుపత్రిలో కాంపౌండర్గా పనిచేస్తున్నాడు. ప్రసాద్కు కొన్ని రోజులుగా ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అయితే అదే యువతిని మరో వ్యక్తి సైతం ప్రేమిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో.. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని......ఈ ఘటనలో ప్రసాద్ తీవ్రంగా గాయపడటంతో అతను చనిపోయినట్లు అతని మిత్రులు తెలిపారు. మృతదేహాన్ని నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com