8 Lakh Gold Pen : రూ.8 లక్షల ఖరీదైన పెన్ను చోరీ

X
By - Manikanta |26 May 2025 1:15 PM IST
మహారాష్ట్ర లోని కొల్హాపూర్ లో జరిగిన రెండవ అంతర్జాతీయ పెన్ షోలో ఖరీదైన పెన్ను ఒకటి చోరీకి గురైంది. పూణేనివాసి వివేక్ కులకర్ణి 24 క్యారెట్ల బంగారంతో దీన్ని తయారు చేశారు. తయారీకి ఐదు నెలలు పట్టిందని వివేక్ చెప్పారు. ఈ కలంపై విష్ణువు వామన అవతారం, జ్ఞానేశ్వర్ మౌలి, అర్జునుడి మత్స్య భేద్ లతో కూడిన అద్భుతమైన కళాకృతులను కలిగి ఉంది. ఈ ప్రదర్శనలో జర్మనీ, జపాన్, ఇటలీ నుండి కూడా పెన్నులు ప్రదర్శనకు వచ్చాయి. ఈ పెన్ ఎగ్జిబిషన్లో 2,000 కంటే ఎక్కువ ఫౌంటెన్ పెన్నులు, రోలర్ పెన్నులు, బాల్ పెన్నులు, మెకనైజ్డ్ పెన్సిళ్లు 75 కంటే ఎక్కువ ప్రఖ్యాత అంతర్జాతీయ బ్రాండ్లకు చెందినవి ఉన్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com