గదిలో ఉరేసుకుని ప్రముఖ గాయని, నటి ఆత్మహత్య

గదిలో ఉరేసుకుని ప్రముఖ గాయని, నటి ఆత్మహత్య

ఢిల్లీలోని సుల్తాన్‌పూర్‌కు చెందిన ప్రముఖ గాయని, నటి విజయ్ లక్ష్మి అలియాస్ మలికా రాజ్‌పుత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె ఇంట్లోని గదిలో ఉరివేసుకుని కనిపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన అనంతరం స్థానిక పోలీసులు కేసుపై దర్యాప్తు ప్రారంభించారు.

కోత్వాలి నగర్‌లోని సీతాకుండ్ ప్రాంతంలో ఉన్న ఇంటి లోపల గదిలో ఫ్యాన్‌కు ఆమె మృతదేహం వేలాడుతూ కనిపించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పూర్తిగా షాక్‌లోకి వెళ్లిపోయారు. ఇంతలో స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి పంచనామా చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

మల్లిక తల్లి సుమిత్రా సింగ్ మాట్లాడుతూ, ఈ సంఘటన జరిగినప్పుడు తమకు తెలియదని చెప్పారు. ''ఇంతకు ముందు తలుపు మూసి ఉంది. లైట్ ఆన్ చేసి ఉంది. ఎంత ప్రయత్నించినా తలుపు తీయలేకపోయాం. చివరికి, నేను కిటికీలోంచి చూశాను, ఆమె అక్కడ నిలబడి ఉంది. నేను తలుపు తట్టగా, మా కూతురు ఉరి వేసుకుని కనిపించింది. నేను నా భర్తకు, కొందరికి ఫోన్ చేసి చెప్పాను ”అని ఆమె చెప్పింది. ఈ మొత్తం ఘటనపై పోలీసు అధికారి శ్రీరామ్ పాండే మాట్లాడుతూ.. ప్రాథమికంగా చూస్తే ఇది ఆత్మహత్యేనని తెలుస్తోంది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే అది తేలనుంది. ఆ నివేదిక ఆధారంగానే తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

Tags

Next Story