Apple Phones : యాపిల్ ఫోన్ల లారీపై రాబరీ.. రూ.11 కోట్ల విలువైన ఫోన్లు చోరీ

Apple Phones : యాపిల్ ఫోన్ల లారీపై రాబరీ.. రూ.11 కోట్ల విలువైన ఫోన్లు చోరీ
X

యాపిల్ కంపెనీకి చెందిన ఐ ఫోన్లతో వెళ్తున్న ట్రక్ ను దుండగులు అడ్డుకుని దోచుకున్నారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ లోని సాగర్ లో ఈ భారీ దొంగతనం జరిగింది. దాదాపు 500కు పైగా ఐ ఫోన్లు చోరీ అయినట్లు పోలీస్ ఉన్నతాధికారి సంజయ్ ఉకే వెల్లడించారు. వాటి విలువ రూ.11 కోట్లుగా ఉంటుందని తెలిపారు.

గుర్గావ్ నుంచి చెన్నైకి ఫోన్ల లోడ్ తో ఈ ట్రక్ వెళ్తుండగా చోరీ జరిగిందని ఆయన చెప్పారు. ట్రక్ డ్రైవర్ కు మత్తుమందు ఇచ్చి దుండగులు ఈ దోపిడికి పాల్పడినట్లుగా తెలిసింది. ఈ చోరీ ఘటనపై ఇప్పటివరకు యాపిల్ ఫోన్ సంస్థ తమను సంప్రదించలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ దోపిడి జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, అలాగే ఈ ట్రక్ ప్రయాణించిన ప్రాంతంలోని వీడియో ట్రాక్ ను సైతం పరిశీలిస్తున్నట్లు సంజయ్ ఉకే చెప్పారు.

చోరీ ఘటనపై బండారీ పోలీస్ స్టేషన్లోని పోలీసులకు ట్రక్ డ్రైవర్ ఫిర్యాదు చేయగా.. ఆ సమయంలో ఎస్ఐ భగత్ చంద్, ఏఎస్ఐ రాజేంద్ర పాండేతోపాటు కానిస్టేబుల్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఈ క్రమంలో వారిపై చర్యలకు ఉప్రకమించినట్లు తెలిపారు.

Tags

Next Story