SAD: ఓ తండ్రి రాసిన మరణ శాసనం

SAD: ఓ తండ్రి రాసిన మరణ శాసనం
X

నా­గ­ర్‌­క­ర్నూ­ల్‌ జి­ల్లా­లో తీ­వ్ర వి­షా­దం చో­టు­చే­సు­కుం­ది. ము­గ్గు­రు పి­ల్ల­ల­ను చంపి తం­డ్రి కూడా ఆత్మ­హ­త్య చే­సు­కో­వ­డం తీ­వ్ర వి­షా­దా­న్ని మి­గి­ల్చిం­ది. కు­టుంబ కల­హాల నే­ప­థ్యం­లో గత­నెల 30న ము­గ్గు­రు పి­ల్ల­ల­తో తం­డ్రి గు­త్తా వెం­క­టే­శ్వ­ర్లు (38) బై­క్‌­పై బయ­ట­కు వచ్చా­డు. వె­ల్దండ మం­డ­లం పె­ద్దా­పు­ర్ గ్రామ శి­వా­రు­లో వి­గ­త­జీ­వి­గా పడి ఉం­డ­డం.. పక్క­నే పు­రు­గుల మందు డబ్బా కని­పిం­చ­డం­తో ఆత్మ­హ­త్య­కు పా­ల్ప­డి­న­ట్లు­గా ప్రా­థ­మి­కం­గా పో­లీ­సు­లు ని­ర్ధ­రిం­చా­రు. డిం­డి ప్రా­జె­క్టు పరి­స­రా­ల్లో తం­డ్రి, ఇద్ద­రు కు­మా­ర్తె­లు, కు­మా­రు­డు తి­రి­గి­న­ట్లు గు­ర్తిం­చా­రు. బు­ధ­వా­రం వెం­క­టే­శ్వ­ర్లు మృ­త­దే­హం లభ్యం కాగా.. చి­న్నా­రుల ఆచూ­కీ గు­రు­వా­రం ఉదయం వరకు తె­లి­య­రా­లే­దు. ఈ క్ర­మం­లో గా­లిం­పు చే­ప­ట్టిన పో­లీ­సు­లు.. ఉప్ప­నుం­తల మం­డ­లం సూ­ర్య తండా సమీ­పం­లో వెం­క­టే­శ్వ­ర్లు చి­న్న­కు­మా­ర్తె వర్షి­ణి (6), కు­మా­రు­డు శి­వ­ధ­ర్మ (4) మృ­త­దే­హా­లు, తాం­డ్ర సమీ­పం­లో పె­ద్ద­కు­మా­ర్తె మో­క్షిత (8) మృ­త­దే­హం లభ్య­మ­య్యా­యి. ము­గ్గు­రు చి­న్నా­రు­ల­ను తం­డ్రే చం­పే­సి పె­ట్రో­ల్‌ పోసి తగు­ల­బె­ట్టి­న­ట్లు పో­లీ­సు­లు ప్రా­థ­మి­కం­గా ని­ర్థా­రిం­చా­రు. అనం­త­రం అతడు కూడా ఆత్మ­హ­త్య చే­సు­కు­న్నా­డు.

Tags

Next Story