Crime News: మీర్‌పేట్ మాధవి హత్య కేసులో మరో సంచలనం

Crime News: మీర్‌పేట్ మాధవి హత్య కేసులో మరో సంచలనం
X

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీర్‌పేట్ మాధవి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మాధవిని తన భర్త గురుమూర్తి ఒక్కడే చంపలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. గురుమూర్తితో పాటు మరో ముగ్గురు ఉన్నారని.. అందులో ఓ మహిళ ఉన్నట్లు భావిస్తున్నారు. నిందితుడు గురుమూర్తిని 5 రోజులు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. హత్యకు సహకరించిన వారి వివరాలను సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఓ ప్లాన్ ప్రకారం గురుమూర్తి ఆమెను హత్య చేశారని పోలీసుల దర్యాప్తులో తేలినట్టు తెలుస్తోంది. దీంతో ఈ హత్యకు సహకరించిన చెల్లెలు సుజాతను A2 గా, తల్లి సుబ్బలక్ష్మిని A3 గా, తమ్ముడు కిరణ్ A4 గా రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు చేర్చినట్టు సమాచారం. మృతురాలి భర్త గురుమూర్తి ఈ హత్యలో A1గా ఉన్న విషయం తెలిసిందే. విచారణలో పలు కీలక విషయాలను పోలీసులు రాబట్టినట్టు తెలుస్తోంది. ప్రధాన నిందితుడిపై హత్యకు సంబంధించి సెక్షన్లు నమోదు చేయగా.. మిగిలిన ముగ్గురిపై బీఎన్‌ఎస్‌లోని 85 సెక్షన్‌(గృహహింస) ప్రయోగించారు. ఈ ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Tags

Next Story