Murder Case : గద్వాల సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు

గద్వాల సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. భర్త హత్యకు ముందే లవర్తో హనీమూన్కు ప్లాన్ చేశారు తిరుమలరావు, ఐశ్వర్య. విమాన టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. తేజేశ్వర్ను చంపిన తర్వాత ముందుగా లద్దాఖ్ వెళ్లి.. అక్కడి నుంచి విదేశాలకు పారిపోయేందుకు పక్కా ప్లాన్ వేశారు. టికెట్లు బుక్ చేసుకోవడంతోపాటు రూ.20 లక్షలు రెడీ చేసుకున్నారు నిందితులు. రెడీ చేసుకున్న 20లక్షల నుంచే సుపారీ గ్యాంగ్కు రూ.2 లక్షలు ఇచ్చారు. జులై 17న తేజేశ్వర్ను హతమార్చిన తర్వాత మృతదేహాన్ని.. కర్నూలులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్లో పూడ్చిపెట్టాలని ప్లాన్ వేశారు. పోలీసులకు దొరికిపోతామనే భయంతో పాణ్యం అడవికి ప్లాన్ ఛేంజ్ చేశారు. తేజేశ్వర్ చేతిపై అమ్మ అనే పచ్చబొట్టుతో మృతదేహాం గుర్తించారు. మొదట తన భార్యను చంపేసి తర్వాత ఐశ్వర్యను.. పెళ్లి చేసుకోవాలని బ్యాంకు మేనేజర్ తిరుమలరావు భావించారు. ఇంతలోనే తేజేశ్వర్తో ఐశ్వర్యకు పెళ్లికావడంతో అతని హత్యకు ప్లాన్ వేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com