USA : అమెరికాలో కాల్పులు.. తెలుగు యువకుడి మృతి

USA : అమెరికాలో కాల్పులు.. తెలుగు యువకుడి మృతి
X

అమెరికాలో జరిగిన దుండగుల కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన రవితేజ అనే యువకుడు మృతిచెందాడు. చైతన్యపురికి చెందిన రవితేజ 2022లో అమెరికా వెళ్లి మాస్టర్స్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంతలో అతడు మరణించాడని తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి పీఎస్ పరిధిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీలో రవితేజ కుటుంబం నివాసం ఉంటుంది. వీరి స్వస్థలం నల్గొండ అయినా.. చాలా ఏళ్ల క్రితం నగరానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. రవితేత ఉన్నత చదువులు చదివేందుకు గాను.. 2022 మార్చిలో అమెరికాకు వెళ్లాడు. అక్కడే మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. ఈ క్రమంలో అమెరికా వాషింగ్టన్‌ ఏస్‌లో గత రాత్రి అతడిపై కాల్పులు జరిగాయి. ఓ దండుగుడు ఉన్నట్లుండి ఒక్కసారిగా విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన రవితేజ.. స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు.

Tags

Next Story