Software Engineer : వేలంలో లడ్డూ దక్కించుకుని.. గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

వినాయకుడి శోభాయాత్రలో పాల్గొన్న యువకుడు అంతలోనే గుండెపోటుతో ప్రాణాలు విడిచిన విషాద ఘటన హైదరాబాద్ లోని మణికొండలో జరిగింది. అల్కాపురి కాలనీలో ఆదివారం సాయంత్రం వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా కాలనీకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ శ్యామ్ ప్రసాద్ లడ్డూ వేలంపాటలో పాల్గొన్నాడు.
పోటాపోటీగా జరిగిన వేలంలో అతడు రూ.15 లక్షలకు లడ్డూను కైవసం చేసుకున్నాడు. అనంతరం శోభాయత్ర సందర్భంగా స్వామివారి లడ్డూ తనకే దక్కిందనే ఆనందంలో ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేశాడు. ఇంతలోనే ఏదో పని మీద ఇంటి వెళ్లిన శ్యామ్ ప్రసాద్ గుండె పోటుతో ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
అప్పటివరకు ఆడుతూ.. పాడుతూ లడ్డూ వేలంలో పాల్గొన్న అతడు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడంతో కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ వార్త స్థానికంగా చాలామందిని షాక్ కు గురిచేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com