TG : సంతోష్ నగర్ లో ఉద్రిక్తత.. భూలక్ష్మీ దేవి విగ్రహం ధ్వంసం

X
By - Manikanta |27 Aug 2024 2:45 PM IST
హైదరాబాద్ పాతబస్తీ సంతోష్ నగర్లో అర్థరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. రక్షపురం కాలనీలో భూ లక్ష్మీ విగ్రహన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, హిందువులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. ధర్నాకు దిగారు.
ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. విగ్రహం ధ్వంసం చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మోదని సూచించారు. కేసు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com