TERROR ATTACK: భారత్‌లో భారీ పేలుళ్లకు కుట్ర

TERROR ATTACK: భారత్‌లో భారీ పేలుళ్లకు కుట్ర
X
8 మంది ముష్కరుల అరెస్ట్

భారతదేశ భద్రతను లక్ష్యంగా చేసుకుని మరోసారి అంతర్జాతీయ ఉగ్రవాద ముఠా కుట్ర పన్నిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నిఘా సంస్థల అప్రమత్తతతో పెద్ద విధ్వంసాన్ని అడ్డుకోవడం సాధ్యమైంది. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ (ISI), బంగ్లాదేశ్‌కు చెందిన తీవ్రవాద గ్రూపులతో సంబంధాలు కలిగిన వ్యక్తులు భారత్‌లో కీలక నగరాల్లో పేలుళ్లు సృష్టించేందుకు ప్రణాళికలు రచించినట్లు సమాచారం బయటపడింది. ఈ నేపథ్యంలో తమిళనాడు పోలీసులు మెరుపుదాడి చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం ద్వారా భారీ ప్రమాదాన్ని తిప్పికొట్టారు. ఈ ఆపరేషన్ దేశ భద్రతా వ్యవస్థల సమన్వయానికి నిదర్శనంగా నిలిచింది.

ఢిల్లీ పోలీసులకు అందిన కీలక సమాచారం ఆధారంగా తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో విస్తృత దర్యాప్తు చేపట్టారు. పాకిస్తాన్ కేంద్రంగా, బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలు ఉన్నట్లు అనుమానాలపై మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలోని దుస్తుల తయారీ యూనిట్లలో పనిచేస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో మిజానూర్ రెహ్మాన్, మహ్మద్ శబాత్, ఉమర్, మహ్మద్ లితాన్, మహ్మద్ షాహిద్, మహ్మద్ ఉజ్జల్ ఉన్నారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో ఒకరు బంగ్లాదేశ్ పౌరుడిగా అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై దర్యాప్తు బృందాలు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.

దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, ఈ వ్యక్తులు నకిలీ ఆధార్ కార్డులను సమర్పించి తమ అసలు గుర్తింపును దాచిపెట్టి గార్మెంట్ ఫ్యాక్టరీల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఉతుకూలి ప్రాంతంలో ఇద్దరు, పల్లడం ప్రాంతంలో ముగ్గురు, తిరుమురుగన్‌పూండి ప్రాంతంలో ఒకరు పని చేస్తున్నట్లు గుర్తించారు. సాధారణ కార్మికుల వేషంలో ఉండి, గోప్యంగా కుట్రలకు పాల్పడుతున్నారని నిఘా వర్గాలు వెల్లడించాయి. పో­లీ­సు­లు ని­ర్వ­హిం­చిన సో­దా­ల్లో నిం­ది­తుల వద్ద నుం­చి ఎని­మి­ది మొ­బై­ల్ ఫో­న్లు, పద­హా­రు సిమ్ కా­ర్డు­లు స్వా­ధీ­నం చే­సు­కు­న్నా­రు. ఈ డి­జి­ట­ల్ పరి­క­రాల ద్వా­రా వారు వి­దే­శీ ఉగ్ర­వాద సం­స్థ­ల­తో సం­బం­ధా­లు కొ­న­సా­గిం­చి­న­ట్లు అను­మా­నం వ్య­క్త­మ­వు­తోం­ది. సో­ష­ల్ మీ­డి­యా­లో పా­కి­స్తా­న్ కేం­ద్రం­గా పని­చే­స్తు­న్న ఉగ్ర­వాద సం­స్థ­ల­కు మద్ద­తు­గా పో­స్టు­లు పె­ట్టి­న­ట్లు కూడా అధి­కా­రు­లు గు­ర్తిం­చా­రు. అదే­వి­ధం­గా దే­శం­లో­ని పలు ప్ర­ధాన నగ­రా­ల్లో నిఘా ని­ర్వ­హిం­చ­డం, ప్రా­ధా­న్యత గల ప్ర­దే­శా­ల­పై రహ­స్య పరి­శీ­ల­న­లు చే­య­డం వంటి కా­ర్య­క­లా­పా­లు చే­సి­న­ట్లు అను­మా­ని­స్తు­న్నా­రు. దర్యా­ప్తు సం­స్థ­లు వె­ల్ల­డిం­చిన వి­వ­రాల ప్ర­కా­రం, ఢి­ల్లీ­లో­ని కొ­న్ని ప్రాం­తా­ల్లో ‘ఫ్రీ కా­శ్మీ­ర్’ పో­స్ట­ర్లు ఏర్పా­టు చే­సిన ఘట­న­తో కూడా ఈ నిం­ది­తు­ల­కు సం­బం­ధం ఉన్న­ట్లు భా­వి­స్తు­న్నా­రు. ఈ కో­ణం­లో కూడా వి­చా­రణ కొ­న­సా­గు­తోం­ది. దే­శం­లో సా­మా­జిక ఉద్రి­క్త­త­లు రే­కె­త్తిం­చే­లా, మత­ప­ర­మైన ప్ర­దే­శా­ల­ను లక్ష్యం­గా చే­సు­కు­ని వి­ధ్వం­సా­ని­కి పా­ల్ప­డే కు­ట్ర పన్ని­న­ట్లు ఇం­టె­లి­జె­న్స్ వర్గాలు వెల్లడించాయి. వీరి అరెస్టుతో భారీ ఉగ్ర కుట్ర భగ్నమైంది.

Tags

Next Story