Kerala Crime : దుర్మార్గుడు.. ఐదుగురిని హత్య చేశాడు

Kerala Crime : దుర్మార్గుడు.. ఐదుగురిని హత్య చేశాడు
X

కేరళలోని తిరువనంతపురంలో 23 ఏళ్ల అఫన్ అనే యువకుడు కొన్ని గంటల వ్యవధిలోనే ఐదుగురిని హత్య చేశాడు. వీరిలో తన తమ్ముడు, నానమ్మ, ఆంటీ, అంకుల్‌తో పాటు ప్రియురాలు కూడా ఉంది. ఆ దుర్మార్గుడు తల్లిపైనా దాడి చేయగా ఆమె ఆసుపత్రిలో చావుతో పోరాడుతోంది. హత్యల అనంతరం నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. తానూ విషం తాగానని చెప్పడంతో షాకైన పోలీసులు అతడిని ఆసుపత్రిలో చేర్చారు. హత్యలకు కారణాలపై విచారిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా ఈ హత్యల అనంత‌రం అఫన్ పోలీసులకు స్వ‌యంగా పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి ఆరుగురిని చంపాను అంటూ చెప్పి మ‌రి లొంగిపోయాడు. ఆపై విషం తాగిన‌ట్లు పోలీసులకు చెప్పడంతో అత‌న్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా.. అఫన్ తన తండ్రితో కలిసి విదేశాల్లో ఉంటున్నాడు. ఇటీవలే తన తల్లి క్యాన్సర్ ట్రీట్ మెంట్ కోసం తిరువనంతపురం వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Tags

Next Story