Hyderabad : పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ

Hyderabad : పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ
X

హైదరాబాద్ ఫిలింనగర్ లోని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగింది. గత శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పొన్నాల ఇంట్లో లక్షన్నర నగదుతో పాటు భారీగా ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. చోరీ ఘటనపై ఫిలింనగర్ పోలీసులకు పొన్నాల భార్య అరుణాదేవి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నారు.

Tags

Next Story