రోడ్డు ప్రమాదంలో మూడు ఏనుగులు మృతి

X
By - Subba Reddy |15 Jun 2023 11:00 AM IST
చిత్తూరు జిల్లాలోని తిరుపతి-బెంగళూరు హైవేపై ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ఏనుగులను డీసీఎం ఢీ కొట్టింది
చిత్తూరు జిల్లాలోని తిరుపతి-బెంగళూరు హైవేపై ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ఏనుగులను డీసీఎం ఢీ కొట్టింది. ఘటనలో మూడు ఏనుగులు అక్కడికక్కడే మృతి చెందాయి. వీటిలో ఒక పెద్ద ఏనుగు, రెండు చిన్న ఏనుగులు ఉన్నాయి. ప్రమాదంలో డీసీఎం ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. ఇక ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. కాగా.. చీకట్లో ఏనుగులు రోడ్డు దాటుతున్న విషయాన్ని డ్రైవర్ గుర్తించలేకపోవడంతో,.. అతివేగంతో ఢీ కొట్టినట్లు భావిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com