మధ్యప్రదేశ్ లో విషాదం.. ఇంటి గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి

మధ్యప్రదేశ్ లో విషాదం.. ఇంటి గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
X

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఓ ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగించి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు.ఒకేసారి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. స్థానికులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. సంఘటనాస్థలికి స్థానిక నేతలు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.ఇదిలా ఉంటే కొండ ప్రాంతం కావడంతో ఇంటిపై బండరాళ్లు పడడంతో శిథిలాలను తొలగించడం కష్టసాధ్యంగా మారింది. ఒక్కొక్క బండరాయిను తొలగించారు. ప్రస్తుతం ఇంకా సహాయ చర్చలు కొనసాగుతున్నాయి. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story