Accident : ముగ్గురిని బలితీసుకున్న క్వారీ గుంత

X
By - Manikanta |17 July 2024 1:39 PM IST
క్వారీ గుంతలో పడి ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలోని బొప్పారంలో జరిగింది. హైదరాబాద్ లో ఉండే శ్రీపాల్ రెడ్డి, రాజు ఇద్దరూ ఫ్రెండ్స్. శ్రీపాల్ రెడ్డి బిల్డర్ కాగా.. రాజు సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నాడు. మంగళవారం బొప్పారంలో జరిగిన ఓ ఫంక్షన్ కు వీరిద్దరూ కుటుంబాలతో కలిసి వెళ్లారు. బుధవారం ఉదయం శ్రీపాల్రెడ్డి, రాజు, ఆయన కుమార్తె (12) క్వారీ చూసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రాజు కుమార్తె క్వారీ గుంతలో పడిపోయింది. గుంతలో నీరు ఉండటంతో ఆమెను కాపాడేందుకు రాజు, శ్రీపాల్రెడ్డి అందులోకి దిగారు. ఈత రాకపోవడంతో ముగ్గురూ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com