నాలుగు రోజుల్లో పెండ్లి.. కరెంట్ షాక్తో వరుడు మృతి

నిర్మల్ జిల్లా కడెం మండలంలోని చిన్న బెల్లాల్ గ్రామంలో నాలుగు రోజుల్లో పెండ్లి కావాల్సిన ఓ యువకుడు కరెంట్ షాక్తో చనిపోయాడు. గ్రామానికి చెందిన నీరాల నీలయ్య, కళ దంపతుల కొడుకు వినోద్(25) ఆదివారం ఇంట్లో స్నానం చేసేందుకు నల్లా తిప్పుతుండగా.. గీజర్ నుంచి నల్లాకు విద్యుత్ సరఫరా జరిగి షాక్కు గురయ్యాడు. కుటుంబసభ్యులు వినోద్ ను ఖానాపూర్ దవాఖానకు తరలిస్తుండగా చనిపోయారు. వినోద్కు ధర్మపురికి చెందిన యువతితో వచ్చే ఆదివారం పెండ్లి
జరగాల్సి ఉంది.
ఖమ్మం రూరల్ మండలంలో కౌలు రైతు ..
ఖమ్మం రూరల్ / కురవి (డోర్నకల్ ) : ఖమ్మం రూరల్ మండలంలో కరెంట్షాక్తో ఓ కౌలు రైతు చనిపోయాడు. స్థానికుల కథనం ప్రకారం..మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం రాముతండాకు చెందిన మాజీ ఉప సర్పంచ్ లకావత్ సోమ్లా(60) మండలంలోని మంగళగూడెం రెవెన్యూ పరిధిలో భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. పక్క చేను రైతు మోటార్ కోసం సోమ్లా వ్యవసాయ భూమి ఫెన్సింగ్ మీది నుంచి కరెంట్ తీగలాగాడు. ఆ వైర్ తెగి ఫెన్సింగ్ కు కరెంట్సరఫరా జరిగింది. గమనించని సోమ్లా పొలంలో మోటార్ అన్ చేసేందుకు వెళ్లి కంచెను పట్టుకోవడంతో కరెంట్షాక్కొట్టి అక్కడిక్కడే చనిపోయాడు.
ఫోన్ చార్జర్ తీస్తుండగా యువతి..
గండీడ్ : సెల్ ఫోన్ చార్జర్ తీస్తుండగా షాక్ కొట్టడంతో నారాయణపేట జిల్లా కొత్తపల్లితండాకు చెందిన పూజ(18) చనిపోయింది. పోలీసుల కథనం ప్రకారం..మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం పలుగుతండాలో ఉంటున్న అక్క సోనీ బాయి ఇంటికి వచ్చిన పూజ రాత్రి కరెంట్బోర్డు నుంచి చార్జర్ తీస్తుండగా షాక్కు గురై కింద పడిపోయింది. కుటుంబీకులు మహబూబ్నగర్ జిల్లా దవాఖానకు తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు .
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com