పింఛన్ అడిగినందుకు వికలాంగుడిపై వాలంటీర్ దాడి..!
By - /TV5 Digital Team |2 Sep 2021 10:21 AM GMT
పింఛన్ అడిగినందుకు ఓ వికలాంగుడిపై వాలంటీర్ దాడి చేశాడు. అనంతపురం జిల్లా గుత్తి మండలం ఊబిచర్లలో వాలంటీర్ ధనంజయ రెచ్చిపోయాడు.
పింఛన్ అడిగినందుకు ఓ వికలాంగుడిపై వాలంటీర్ దాడి చేశాడు. అనంతపురం జిల్లా గుత్తి మండలం ఊబిచర్లలో వాలంటీర్ ధనంజయ రెచ్చిపోయాడు. మూడు నెలలుగా పింఛన్ రావడం లేదని వికలాంగుడు చిన్నపాలేటి.. సచివాలయంలో అధికారులను ప్రశ్నించాడు. అయితే ప్రతి నెలా ఇస్తున్నట్లు వారు సమాధానం చెప్పడంతో.. వాలంటీర్కు ఫోన్ చేశాడు. దీంతో ఇంటికి వస్తే పింఛన్ ఇస్తానని చెప్పి.. తనపై దాడి చేశాడని వికలాంగుడు ఆరోపిస్తున్నాడు. దాడిలో సృహ కోల్పోయిన వికలాంగుడిని ఆస్పత్రిలో చేర్పించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com