Tirumala తిరుమల శ్రీవారికి బంగారు లక్ష్మీ పతకం విరాళం

X
By - Manikanta |13 Aug 2025 10:45 PM IST
శ్రీవారికి బెంగళూరు భక్తులు భారీ విరాళాలను సమర్పించారు. బుధవారం ఉదయం బెంగళూరుకు చెందిన కేఎం శ్రీనివాసమూర్తి అనే భక్తుడు శ్రీవారిని అలంకరించేందుకు గాను రూ.25 లక్షల విలువైన వజ్రం, వైజయంతితో పొదిగిన 148 గ్రాముల బంగారు లక్ష్మీ పతకాన్ని విరాళంగా అందించారు. ఈ ఆభరణాన్ని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.
అలాగే బెంగళూరుకు చెందిన మరో భక్తుడు కల్యాణ్ రామన్ కృష్ణమూర్తి టీటీడీకి భారీ విరాళం ఇచ్చారు. శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు ఆయన రూ.కోటి విరాళంగా అందజేశారు. ఈ విరాళానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్ను (డీడీ) టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com