అయ్యప్పలూ.. అలా చేయకండి స్వామీ.. : రైల్వే శాఖ విజ్ఞప్తి
నిబంధనలు అతిక్రమించిన వారిపై మూడేళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తారని హెచ్చరించారు.
BY Prasanna16 Dec 2021 5:59 AM GMT

X
Prasanna16 Dec 2021 5:59 AM GMT
అగ్గిపుల్లలు, అగరబత్తులు రైలు బోగీల్లో వెలిగించరాదని వక్షిణ మధ్య రైల్వే శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు విజ్ఞప్తి చేసింది. శబరిమల యాత్రికుల కోసం డిసెంబర్ 16 నుంచి సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, కాకినాడ, తిరుపతి, నాందేడ్ స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపారు.
సురక్షిత ప్రయాణం కోసం ప్రయాణీకులు రైల్వే శాఖతో సహకరించాలని కోరారు. బోగీల్లో ప్రయాణీకులు పూజలో భాగంగా కర్పూరం వెలిగించడం, అగరబత్తులు వెలిగించడం వంటివి చేయరాదని చెప్పారు. రైళ్లలో అగ్ని సంబంధిత వస్తువులు తీసుకెళ్లడం నిషేధం అని పేర్కొన్నారు.
రైల్వే భద్రతా చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై మూడేళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తారని హెచ్చరించారు. భక్తులు కోవిడ్ ప్రోటోకాల్ను కూడా తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.
Next Story
RELATED STORIES
T-Hub 2.0: దేశంలోనే ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్-2...
28 Jun 2022 1:50 PM GMTLB Nagar: కన్నకొడుకే ఇంటి నుంచి తరిమేశాడు.. వృద్ద దంపతుల ఆవేదన..
28 Jun 2022 1:10 PM GMTNizamabad: జువైనల్ హోమ్ నుంచి బాల నేరస్తులు పరారీ.. ఆ అయిదుగురి కోసం...
28 Jun 2022 11:45 AM GMTSiddipet: సిద్దిపేటలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 120 మందికి...
28 Jun 2022 10:45 AM GMTKCR: గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య ఆత్మీయ పలకరింపులు.. 9 నెలల...
28 Jun 2022 9:15 AM GMTInter Result: ఇంటర్ ఫలితాలు విడుదల..
28 Jun 2022 6:03 AM GMT