చక్రస్నానంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగింపు

X
By - Nagesh Swarna |24 Oct 2020 12:04 PM IST
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తుది అంకానికి చేరుకున్నాయి. శనివారం చివరి రోజున శ్రీవారికి చక్రస్నానం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం, చక్రత్తాళ్వార్లకు అభిషేకాలు నిర్వహించారు. దూప దీప నైవేధ్యాలు సమర్పించారు. చక్రస్నానంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. శనివారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారికి బంగారు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com