TTD: ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనున్న టిటిడి..

TTD: తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఎన్ని సార్లు దర్శించుకున్నా తనివి తీరదు భక్తులకు. ఏడుకొండలపై కొలువై ఉన్న ఆ వెంకన్న స్వామిని ఏటా కొన్ని లక్షల మంది భక్తులు సందర్శిస్తుంటారు. తాజాగా భక్తుల సౌకర్యార్ధం టిటిడి దేవస్థాన అధికారులు 2022, జనవరి నెలకు సంబంధించి రోజుకు 20,000 చొప్పున 6.20 లక్షల టికెట్లు విడుదల చేస్తామని తెలిపింది.
ఈనెల డిసెంబరు 24 ఉదయం 9 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేయనున్నట్లు టిటిడి ప్రకటించింది. ఇక డిసెంబర్ 31 నుంచి తిరుపతిలో ఆఫ్లైన్లో సర్వదర్శనం టికెట్లు ఇస్తామని తెలిపింది. జనవరి నెలకు సంబంధించి రోజుకు 5వేల చొప్పున మొత్తం 1.55 లక్షల సర్వదర్శనం టికెట్లు ఇస్తామని దేవస్థాన అధికారులు పేర్కొన్నారు.
దర్శనం కోసం భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అధికారిక వెబ్సైట్ నుండి రూ. 300 టిక్కెట్ను కొనుగోలు చేయవచ్చు www.tirupatibalaji.ap.gov.in .
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com