శ్రీశైలంలో ఆగిపోయిన రోప్వే.. భక్తుల ఆందోళన

By - Subba Reddy |20 May 2023 10:30 AM GMT
శ్రీశైలంలో సాంకేతిక లోపంతో కొంతసేపు రోప్ వే అగిపోయింది. ఎక్కడి భక్తులు అక్కడే నిలిచిపోయారు
శ్రీశైలంలో సాంకేతిక లోపంతో కొంతసేపు రోప్ వే అగిపోయింది. ఎక్కడి భక్తులు అక్కడే నిలిచిపోయారు. శ్రీశైలం నుండి పాతాళగంగకు భక్తులను తీసుకెళ్లే రోప్ వే సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. విద్యుత్ అంతరాయంతో కూడా ఇరవై నిమిషాల పాటు రోప్ వే ఆగిపోవడంతో, ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందారు భక్తులు. కరెంటు సమస్యతో తీవ్ర ఇబ్బందలకు గురయ్యారు భక్తులు. జనరేటర్ల సాయంతో సమస్యను పరిష్కరించారు ఆలయ సిబ్బంది.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com