శబరిమల దర్శనాలకు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం మార్గదర్శకాలు

శబరిమల దర్శనాలకు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం మార్గదర్శకాలు

శబరిమలలో నేటి నుంచి డిసెంబర్ 26 వరకు మండల పూజ జరగనుంది. డిసెంబర్ 30 నుంచి జనవరి 20 వరకు మకరవిలక్కు పూజ జరుపుతారు. వారంలో ఐదు రోజులు రోజుకు 1,000 మందిని, శనివారం, ఆదివారం మాత్రం 2,000 భక్తుల్ని అనుమతించనున్నట్టు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు వెల్లడించింది. మండల-మకరవిలక్కు పూజ సందర్భాల్లో దర్శనానికి రోజుకు 5,000 మందిని మాత్రమే అనుమతిస్తారు. ఇప్పటికే డిసెంబర్ వరకు క్యూ స్లాట్లు బుక్‌ అయినట్టు తెలిపింది. నవంబర్, జనవరిలో కొన్ని స్లాట్స్ మిగిలే ఉన్నాయని తెలిపింది.

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తాజాగా కొత్త గైడ్‌లైన్స్ జారీ చేసింది. వర్చువల్ క్యూలో రిజిస్టర్ చేసుకోని భక్తులను అనుమతి లేదని స్పష్టంచేసింది. భక్తులందరూ తప్పనిసరిగా కోవిడ్-19 నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకొని రావాలని తెలిపింది. అది కూడా 24గంటల లోపు తీసుకున్న సర్టిఫికెట్ అయి ఉండాలని స్పష్టంచేసింది. మెడికల్ ఇన్స్యూరెన్స్ కార్డు, మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరి అని తెలిపింది. ఈ సారి పంబ నదిలో స్నానాలకు అనుమతి లేదని స్పష్టంచేసిన ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు.. పంబలో షవర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపింది.

పంబలో లేదా సన్నిధానంలో భక్తులు బస చేసేందుకు అనుమతి లేదని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు స్పష్టంచేసింది. నీలక్కల్ దగ్గర పరిమితంగా బస ఏర్పాట్లు ఉంటాయని తెలిపింది. స్వామి అయ్యప్పన్ రోడ్డు ద్వారానే ట్రెక్కింగ్‌కు అనుమతి ఉందని, సన్నిధానం దగ్గర నెయ్యాభిషేకం కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉంటాయని వెల్లడించింది. భక్తులను పంబకు తీసుకెళ్లి తిరిగి నీలక్కల్‌కు తీసుకొచ్చేందుకు లైట్ మోటార్ వెహికిల్స్ అందుబాటులో ఉంటాయని దేవస్థానం బోర్డు తెలిపింది.


Tags

Read MoreRead Less
Next Story