World Parota : వరల్డ్ పరోటాకు 23వ స్థానం

World Parota : వరల్డ్ పరోటాకు 23వ స్థానం
X

ప్రపంచంలోని 50 అత్యుత్తమ అల్పాహారాల జాబితాలో భారత్ కు చెందిన మూడు వంటకాలకు స్థానం దక్కింది. ఈ జాబితాలో మహారాష్ట్రకు చెందిన మిసల్ పాప్ 18వ స్థానంలో నిలిచింది. పరోటా 23వ స్థానాన్ని దక్కించుకోగా, దేశ రాజధాని ఢిల్లీ వాసుల ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన చోలే బటూరే 32వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ర్యాంకింగ్ ల కోసం టేస్ట్ అట్లాస్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూజర్ల నుంచి రేటింగ్లను సేకరిస్తుంది. అల్పాహార ర్యాంకింగ్ల కోసం 2025 మే 15 నాటికి 41వేలకు పైగా రేటింగ్లను ప్రాసెస్ చేయగా, వాటిలో సుమారు 24,000 రేటిం గ్లను సరైనవిగా, విశ్వసనీయమైనవిగా ని ర్ధారించినట్లు సంస్థ తెలిపింది. టర్కీ వంటకం కహ్వాల్తీ, సెర్బియా వంటకం కొంప్లేట్, లిబియా వంటకం స్ఫింజ్ వరుసగా మొదటి మూడు స్థా నాల్లో నిలిచాయి. అంతేకాదు భారత్ లో అన్ని రాష్ట్రాలకు ఓ ప్రత్యేక సంస్కృతి , సాంప్రదాయం కలిగి ఉంటాయి. ప్రజలు వీటితోనే తమ దినచర్యను ప్రారంభిస్తారని టేస్ట్ అట్లాస్ తన నివేదికలో ప్రశంసించింది. అంతేకాదు మిస్సైల్ పావ్ కూడా హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ ఫాస్ట్ లో ఒకటని తేల్చింది. ఈ విస్తృత జాబితాలో నిహారి, శ్రీఖండ్, పాలక్ పనీర్ వంటి మరిన్ని భారతీయ వంటకాలు కూడా ఉండడం మరో విశేషం. అంతేకాదు మసాలా ఆమ్లెట్ , రొట్టెలు కూడా ఉన్నాయి. మిగిలిన దేశాల్లో చేసిన గుడ్లు స్పెషల్స్ కంటే భారత్ స్పెషల్స్ చాలా బాగున్నాయని తెలిపారు.

Tags

Next Story