భారతీయ నర్సు నిమిష ప్రియకు ఉరిశిక్ష రద్దు

భారతీయ నర్సు నిమిష ప్రియకు ఉరిశిక్ష రద్దు
X

యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియ ఉరిశిక్షను రద్దు చేసేందుకు యెమెన్ అధికారులు నిర్ణయించారు. ఆమె కుటుంబానికి ఇది పెద్ద ఊరట. సున్నీ మత ప్రబోధకుడు కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే, భారత విదేశాంగ శాఖ నుండి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ నిర్ణయానికి ముందు యెమెన్‌ రాజధాని సనాలో అత్యున్నత సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉత్తర యెమెన్‌ అధికారులు, అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు పాల్గొన్నట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. నిమిష ప్రియ, కేరళకు చెందిన నర్సు, 2017లో యెమెన్ జాతీయుడైన తలాల్ అబ్దు మహదీ హత్య కేసులో దోషిగా తేలింది. ఆమె అతనికి మత్తు మందు ఇచ్చే ప్రయత్నంలో అధిక మోతాదు కారణంగా అతను మరణించాడని నిమిష ప్రియ తరపు న్యాయవాదులు వాదించారు. ఈ కేసులో ఆమెకు మరణశిక్ష విధించబడింది, అది జూలై 16న అమలు కావాల్సి ఉంది. భారత ప్రభుత్వం, మత పెద్దలు, మరియు వివిధ సంస్థల కృషి ఫలితంగా మరణశిక్ష వాయిదా పడింది. అయితే ఈ మరణశిక్ష రద్దు నిమిష ప్రియకు పెద్ద విజయం. ఆమె యెమెన్ జైలు నుంచి ఎప్పుడు విడుదల అవుతుంది, లేక ఆమెకు జీవితఖైదు విధించబడుతుందా, లేదా 'బ్లడ్ మనీ' (క్షమాపణ డబ్బు) చెల్లించాల్సి ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు భారత విదేశాంగ శాఖ నుండి అధికారికంగా వచ్చిన తర్వాతే స్పష్టత వస్తుంది.

Tags

Next Story