Delhi: ఫ్లైఓవర్పై రెండు కార్లు ఢీ.. ఒకరు మృతి, పరారీలో డ్రైవర్..
అతి వేగం అనర్ధాలకు కారణం.. అయినా అదే తీరు. మద్యం సేవించో, మరో కారణంతోనో వాహనాలను పరిమితికి మించిన వేగంతో నడుపుతుంటారు. ప్రాణాలు పోవడానికి కారణమవుతుంటారు.
నైరుతి ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఎన్క్లేవ్ ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన మరో కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇప్పటివరకు జరిగిన విచారణ ప్రకారం, రెండు కార్లలో డ్రైవర్లు తప్ప మరెవరూ లేరని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
మరో ఘటనలో ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వేపై 40-50 మందితో వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొట్టింది. బస్సు ఉజ్జయిని నుంచి ఢిల్లీకి వెళ్తుండగా రాజస్థాన్లోని దౌసా జిల్లా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 20 మంది స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, నలుగురైదుగురు వ్యక్తులు తీవ్ర గాయాలు కావడంతో జైపూర్కు రిఫర్ చేశారు.
"బస్సు 40-50 మంది ప్రయాణికులతో ఉజ్జయిని నుండి ఢిల్లీకి వెళ్తోంది. ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వేలో, పొగమంచు కారణంగా బస్సు ట్రక్కును ఢీకొట్టింది. రాజస్థాన్ మాజీ క్యాబినెట్ మంత్రి మమతా భూపేష్ ఈ ప్రమాదంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, "ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వేలోని దౌసా సమీపంలోని లహదీ కా బస్ ప్రాంతంలో బస్సు మరియు ట్రాలీకి సంబంధించిన ఘోర ప్రమాదం గురించి వినడం విచారకరం. బాధితులు త్వరగా కోలుకోవాలని శ్రీ బాలాజీ మహరాజ్ని ప్రార్థిస్తున్నాన
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com