Railways : రైలు పట్టాలపైకి వరద నీరు.. రైళ్ల వేగం తగ్గింపు

రాష్ట్రంలో మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు చోట్ల రైలు పట్టాలపైకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రైల్వే ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైళ్ల వేగాన్ని తగ్గించాలని రైల్వేశాఖ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. పిడుగురాళ్ల-బెల్లంకొండ మధ్యలోని వంతెన నంబర్-59 వద్ద వరద నీరు ప్రమాద హెచ్చరిక మార్క్కు చేరుకుంది.గుంటూరు-తెనాలి మధ్య వంతెన నంబర్-14 వద్ద, అలాగే వెజెండ్ల-మణిపురం మధ్య వంతెన నంబర్-14 వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది.
ఈ పరిస్థితుల కారణంగా రైల్వే సిబ్బంది రైళ్లను కేవలం 30 కి.మీ./గం. వేగంతో మాత్రమే నడపాలని రైల్వేశాఖ ఆదేశించింది. అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారని, నీటి మట్టం తగ్గిన తర్వాత రైళ్ల సాధారణ వేగం పునరుద్ధరించబడుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com