Special Train : తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు

తిరుపతి వెళ్లే భక్తులకు శుభవార్త. చర్లపల్లి టెర్మినల్ నుండి తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి, ముఖ్యంగా పండుగలు, సెలవు దినాల్లో తిరుపతికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 3 నుంచి 24వరకు ప్రతి ఆదివారం తిరుపతి - చర్లపల్లిమార్గంలో 4 రైళ్లు, ఆగస్టు 4నుంచి 25వరకు ప్రతి సోమవారం చర్లపల్లి - తిరుపతి రూట్లలో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లుగా సౌత్ సెంట్రల్ రైల్వేస్ అధికారులు తెలిపారు. అంతేకాకుండా వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక వీక్లీ సర్వీసులను నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నెల 25 నుంచి ఆగస్టు 15 వరకు ప్రతి శుక్రవారం ఎర్నాకుళం- పాట్నా మార్గంలో నాలుగు రైళ్లు, ఈనెల 28నుంచి ఆగస్టు 18 వరకు ప్రతి సోమవారం పాట్నా-ఎర్నాకుళం మధ్యలో నాలుగు రైళ్లు నడుపనున్నట్లు అధికారులు తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com