Gold : పెరిగిన బంగారు ఆభరణాల వినియోగం

దేశంలో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో బంగారు ఆభరణాల వినియోగం విలువ పరంగా 12-14 శాతం వృద్ధిని నమోదు చేస్తుదని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. 2025 ఆర్ధిక సంవతరంలో బంగారం ధర 33 శాతం పెరిగింది. 2026లో కూడా ధరలు పెరుగుతాయని ఇక్రా తెలిపింది. ప్రణాళికాబద్దమైన రిటైల్ విస్తరణ, అసంఘటిత విభాగం నుంచి మార్కెట్ వాటా లాభాలు దీనికి మద్దతు స్తాయని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, గ్రూప్ హెడ్ జితిన్ మక్కర్ చెప్పారు. పెరు గుతున్న ధరల కారణంగా వినియోగం తగ్గుతున్నా, ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న శుభ దినాల మూలంగా బంగారం డిమాండ్ కు మద్దతు లభిస్తుందని చెప్పారు.
ఈ ఆర్ధిక సంవత్సరంల బంగారు ఆభరణాల వినియోగ విలువలో గణనీయంగా 28 శాతం పెరుగుదల కనిపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే తరహా పెరుగుదల ఉంటుందని ఇక్రా అంచనా వేసింది. 2024 ఆర్థిక సంవత్సరంలో బంగారు కడ్డీలు వినియోగం 17 శాతం, నాణేల వినియోగం 25 శాతం పెరిగింది. ఇది ప్రపంచ స్థూల ఆర్థిక అనిశ్చితి, పెరిగిన భౌగోళిక రాజకీయ, వాణిజ్య ఉద్రిక్తతల మధ్య పెట్టుబడిదారుల సురక్షిత ఆస్తుల విషయంలో బంగారం ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుందని ఇక్రానివేదిక పేర్కొంది. బంగారు కడ్డీలు, నాణేల డిమాండ్ 10శాతం పెరిగే అవకాశం ఉందని, ఇది మొత్తం బంగారం డిమాండ్లో 35 శాతం ఉంటుందని ఇక్రా అంచనా వేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరం కంటే ప్రస్తుతం బంగారం ధరలు సగటున 20 శాతం అధికంగా ఉన్నాయి. దీని మూలంగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో బంగారం వినియోగంలో 9-10 శాతం వరకు తగ్గుదల ఉంటుందని నివేదిక పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com