Srisailam Reservoir : వరద ప్రవాహంతో ఉప్పొంగుతున్న కృష్ణమ్మ.. నిండుకుండలా శ్రీశైలం జలాశయం..

తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం కాస్త తగ్గినప్పటికీ ఎగువ నుండి వస్తున్న వరదలతో కృష్ణమ్మ పొంగి పొర్లుతోంది. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో శ్రీశైలం జలాశయం నిండు కుండల మారింది. సుంకేసుల, జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుండడంతో కృష్ణా నదిలో నీటి ప్రవాహం ప్రమాదకరస్థాయి కి చేరుతుంది. ఈ రెండు ప్రాజెక్టుల నుంచి శ్రీశైలంకు 1,27,392 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా.. ప్రస్తుతం శ్రీశైలం ఔట్ ఫ్లో 1,40,009 క్యూసెక్కులుగా నమోదైంది.
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు...శ్రీశైలం రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 53,764 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేశారు. అంతే కాకుండా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20 వేల క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడి గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,930 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882 అడుగుల నీటిమట్టం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 201.12 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com