Microsoft : మైక్రోసాఫ్ట్ లేఆఫ్స్ ... 300 మంది తొలగింపు

Microsoft : మైక్రోసాఫ్ట్ లేఆఫ్స్ ... 300 మంది తొలగింపు
X

ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగులకు షాక్ఇచ్చింది. ఇప్పటి కే వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపిన సంస్థ.. తాజాగా మరో 300 మందిని తొలగి స్తూ నిర్ణయం తీసుకుంది. సంస్థ కార్యకలాపా ల్లో ఏఐ వినియోగాన్ని పెంచే దిశగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ లేఆఫ్ లు చోటుచే సుకున్నాయి. ఈ విషయాన్ని బ్లూమ్బర్గ్ తన కథనంలో పేర్కొంది. తాజా కోతలు సంస్థలోని మొత్తం సిబ్బందిలో 1 శాతం కంటే తక్కువ అని సియాటిల్ టైమ్స్ నివేదిక తెలిపింది. 'మార్కె ట్లో పైచేయి సాధించేలా సంస్థను ఉత్తమంగా ఉంచేందుకు అవసరమైన సంస్థాగత మార్పుల ను అమలు చేస్తున్నం' అని మైక్రోసాఫ్ట్ తన అధి కారిక ప్రకటనలో తెలిపింది. తాజా రౌండ్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ప్రాడక్ట్ మేనేజర్లు ఎక్కు వగా ఎఫెక్ట్ అయినట్లు సమాచారం. కాగా, మైక్రోసాఫ్ట్ గత నెల మధ్యలో వేలాది మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఏఐ, ఆటోమేషన్‌ వైపు పయనిస్తున్న నేపథ్యంలో ఉద్యోగాల కోతలు ప్రారంభించింది. అందులోభాగంగానే గత నెలలో సుమారు 6వేల మందికి ఉద్వాసన పలికింది. అయితే, ఇందులో ఏఐ వ్యవస్థలు రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఎక్కువగా ఉన్నారు. మార్కెట్‌లో పైచేయి సాధించేలా సంస్థను ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సంస్థాగత మార్పులను అమలుచేస్తూనే ఉంటామని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి తెలిపారు.

Tags

Next Story