Nagababu : తల్లి ఆరోగ్యంపై నాగబాబు కీలక ప్రకటన

మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనాదేవి అనారోగ్యంతో బాధపడుతున్నారని, తీవ్ర అస్వస్తతకు గురయ్యారని, విజయవాడ నుండి ఆమె తనయుడు పవన్ కల్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై ఆమె తనయుడు నాగబాబు స్పందించారు. "అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది. ఈ విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఆమె ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని " తెలిపారు. దీంతో అంజనా దేవి ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారానికి ఆయన చెక్ పెట్టారు. ఇదే విషయంపై చిరంజీవి టీమ్ సైతం స్పందించింది. చిరంజీవి తల్లికి సీరియస్ అని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు. చిరంజీవి తన కొత్త చిత్రం షూటింగ్ కోసం షామీర్ పేటలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యక్తిగత పనులపై హైదరాబాద్ వచ్చారు అని స్పష్టం చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com