RCB Announces : ఆర్సీబీ కీలక నిర్ణయం.. మృతులకు రూ. 10లక్షలు

RCB Announces : ఆర్సీబీ కీలక నిర్ణయం.. మృతులకు రూ. 10లక్షలు
X

ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా నిన్న జరిగిన తొక్కిసలా టలో 11 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 33 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై ఆర్సీబీ బృందం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. మరణించిన 11 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్టు తెలిపింది. గాయపడిన వారి సహాయార్థం 'ఆర్సీబీ కేర్స్' పేరిట ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. నిన్న సాయంత్రం చిన్నస్వామి స్టేడియం గేట్ వద్ద 23 లక్షల మంది గుమిగూడిన విషయం తెలిసిందే. ఇరుకైన గేట్లు, సరైన సమాచారం, ఏర్పాట్లు లేకపోవడంతో జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య కూడా మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ. 10 లక్షల చొప్పున సాయం, గాయపడిన వారికి ఉచిత వైద్యం అందిస్తామని ప్రకటించారు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేసీఏ) మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అదనపు సాయం అందజేయనున్నట్టు తెలిపింది.

Tags

Next Story