Actor Mohan Babu : నటుడు మోహన్ బాబుకు ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు

X
By - Manikanta |13 Feb 2025 2:30 PM IST
జర్నలిస్టుపై దాడి కేసులో ప్రముఖ నటుడు మోహన్ బాబుకు ఊరట దక్కింది. ఆయనకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల మోహన్ బాబు ఇంటికి పలువురు జర్నలిస్టులు వెళ్లడంతో మోహన్ బాబు కోపం తెచ్చుకొని అనుకోకుండా ఓ జర్నలిస్ట్ పై దాడి చేసారు. దాంతో అతను హాస్పిటల్ పాలయ్యాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసారు. మోహన్ బాబు తరపు న్యాయవాది ఈ కేసు విచారణలో మాట్లాడుతూ.. దెబ్బ తగిలిన జర్నలిస్ట్ ని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి, లిఖితపూర్వకంగా క్షమాపణ కూడా చెప్పారు మోహన్ బాబు. తనకు అవసరమైన ఆర్థిక సహాయం కూడా చేస్తామని ప్రకటించారు. ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత అని, ఒక సెలబ్రెటీ గా ఉన్నారు. అలాంటి పని కావాలని చేయలేదు అని తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com